జమ్మూ కశ్మీర్లోని రాజౌరి జిల్లా కలకోట్ అడవుల్లో ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఆర్మీ అధికారులతో పాటు ఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతం సంఘటనా స్థలంలో ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నది.
Also Read.. రజినీకాంత్ కి అభివృద్ధి కనబడ్డది.. ప్రతిపక్ష గజినీలకు కనిపించడం లేదు.. కేటీఆర్
అటవీ ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులు దాక్కున్నట్లుగా భావిస్తున్నారు. పోలీసులు, సీఆర్పీఎఫ్, ఆర్మీ సిబ్బంది ఉగ్రవాదులను చుట్టుముట్టారు. ప్రస్తుతం సమాచారం మేరకు ఇద్దరు ఆర్మీ కెప్టెన్లు మృతి చెందారు. మరో వైపు ఓ మేజర్ ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడ్డారని జమ్మూ ఐజీపీ ఆనంద్ జైన్ తెలిపారు.