Saturday, May 18, 2024

రామాలయాలన్నింటికి ఉచితంగా ‘ఆదిపురుష్’ టికెట్లు

spot_img

‘బాహుబలి’తో టాలీవుడ్ స్థాయిని ప్రపంచానికి తెలియజేసిన నటుడు ప్రభాస్. ఆయన నటించిన ‘ఆదిపురుష్’ రేపు జూన్ 16న విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న అభిమానులు టికెట్ల కోసం ఎగబడ్డారు. దాంతో ఈ సినిమా టికెట్లు ఆన్‎లైన్ ఫ్లాట్ ఫాంలలో హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి.

కాగా.. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా శ్రేయాస్ మీడియా ప్రతినిధులు ‘ఆదిపురుష్’ టిక్కెట్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. భద్రాచలంలోని పర్ణశాల నుంచి ఉచిత టిక్కెట్ల పంపిణీ ప్రారంభించారు. పర్ణశాలలోని ఇందిరా నగర్ శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ అర్చకులకు ఉచితంగా టిక్కెట్లు పంపిణీ చేశారు. మూవీ ప్రమోషన్‎లో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రతీ రామాలయానికి 101 టికెట్లు అందజేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఎండోమెంట్ పరిధిలో ఉన్న అన్ని దేవాలయాలకు సుమారు పదివేల టికెట్లు అందజేయనున్నట్లు తెలిపారు.

ఓం రావత్ ద‌ర్శ‌క‌త్వంలో టీ సిరీస్ బ్యాన‌ర్‌పై భూష‌ణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో శ్రీరామ చంద్రుడిగా ప్ర‌భాస్‌.. జాన‌కీ దేవిగా కృతి స‌న‌న్ న‌టించారు. లంకేశ్వ‌రుడు రావ‌ణుడుగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ న‌టించగా.. హనుమంతుడి పాత్రలో దేవదత్తా, లక్ష్మణుడిగా బాలీవుడ్ హీరో సన్నీ సింగ్ చేశారు.

Latest News

More Articles