Sunday, May 19, 2024

తెలంగాణ సత్తా.. దేశంలోనే ఉత్తమ పంచాయితీగా జగన్నాథపురం

spot_img

హైదరాబాద్: జాతీయ నీటి అవార్డులు జల్ శక్తి శాఖ ప్రకటించింది. దేశంలోనే ఉత్తమ పంచాయితీగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జగన్నాథపురం గ్రామం నిలిచింది. ఉత్తమ జిల్లాగా ఆదిలాబాద్ జిల్లా మూడో స్థానం పొందింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పల్లె ప్రగతి దినోత్సవం నిర్వహిస్తున్న రోజునే ఈ అవార్డు లభించడం విశేషం.

హైదరాబాద్ లోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ యూనివర్సిటీ ఉత్తమ విద్యాసంస్థగా అవార్డును అందుకోనుంది. నీటి నిర్వహణ, సంరక్షణ కృషి చేస్తున్నందుకు అవార్డులను కేంద్ర జల్ శక్తి శాఖ అందిస్తున్నది. ఈ నెల 17న ఢిల్లీలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధనకడ్ అవార్డులు ప్రధానం చేయనున్నారు.

Latest News

More Articles