పార్కింగ్ చేస్తున్న కారు మృత్యుశకటంలా మారింది. చిన్న ఆదమరుపు సొంత మనవడి ప్రాణాలు తాత చేతిలో పోయేలా చేసింది. ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..కేరళలోని కాసర్గోడ్ జిల్లాలో ఓ వ్యక్తి తన కారును పార్క్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు తన సొంత కుటుంబానికి చెందిన చిన్నారి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ ఘటనలో చిన్నారి మృతి చెందినట్లు తెలుస్తోంది. పోలీసులు చెబుతున్న కథనం ప్రకారం, కారు డ్రైవర్ మరణించిన చిన్నారికి తాత అవడం గమనార్హం.
మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డ్రైవర్ పార్కింగ్ చేస్తున్నప్పుడు తన మనవడు కారు వెనుక ఉన్నాడనే సంగతి చూడలేదని, తెలియకుండానే అతనిపైకి కారును పరిగెత్తించినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాల్లోకి వెళిత ఈ ఘటన నవంబర్ 10న జరిగింది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియో దాదాపు 24 సెకన్లు. ఇందులో ఓ పిల్లవాడు కారు వెనుక నిలబడి ఉన్నట్లు కనిపించింది.
కారు ముందుకు రాగానే చిన్న పిల్లాడు కారు వెనుక వైపు వెళ్లడం వీడియోలో కనిపిస్తోంది. కారు పార్క్ చేస్తున్న ప్రదేశంలో పడిన బొమ్మ బైక్ కోసం పిల్లవాడు వెళ్లాడు. ఇంతలో కారు డ్రైవర్ కారును వెనక్కు కదిలించాడు. చిన్న పిల్లవాడు కారు ఎడమ చక్రం కిందకు పడ్డాడని కూడా అతనికి చూసుకోలేదు..
పిల్లవాడు కారు చక్రాల కిందకు రాగానే ఏడవడం మొదలుపెట్టాడు. ఇది చూసిన మరో పిల్లాడు పరిగెత్తుకుంటూ వచ్చి పిల్లవాడిని బయటకు తీసేందుకు ప్రయత్నించాడు. ఇంతలో తన మనవడు కారు కింద పడ్డాడని కారు డ్రైవర్కి తెలుసుకొని, అతడిని బయటకు తీసి ఒడిలోకి తీసుకుంటున్న దృశ్యం కనిపించింది. అక్కడ నిలబడిన మరో వ్యక్తి కూడా సహాయం కోసం పరిగెత్తడం కనిపించింది.
మీడియా కథనాల ప్రకారం, ఘటనలో మరణించిన చిన్నారి వయస్సు రెండేళ్లు. వెంటనే మంగళూరు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే వైద్యులు పిల్లవాడి ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: దంచికొడుతున్న వానలు.. రెండు రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలు బంద్