Friday, May 17, 2024

నేడు గురుకుల జేఎల్, డీఎల్ ఫలితాలు వెల్లడి..!!

spot_img

గురుకుల్లో జూనియర్ లెక్చరర్ పరీక్ష రాసిన అభ్యర్థులకు అలర్ట్. నేడు 2,717 జూనియర్ లెక్చరర్ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షకు సంబంధించిన తుది ఎంపిక ఫలితాలను నేడు నియామక బోర్డు వెల్లడించనుంది. 1924 జూనియర్ కళాశాలు, 793 డిగ్రీ కాలేజీల్లో అధ్యాపక పోస్టులకు గత ఏడాది ఆగస్టులో రాతపరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అందులో ప్రతిభ ఆధారంగా 1:2నిష్పత్తిలో మెరిట్ జాబితాను ఈనెల రెండో వారంలో బోర్డు రిలీజ్ చేసింది. ఈనెల 19, 20 వ తేదీల్లో ధ్రువీకరణ పత్రాల పరిశీలనను చేపట్టింది. ఆ వెంటనే డెమో తరగతులు కూడా నిర్వహించనుంది. డెమో తరగతుల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా పైనల్ రిజల్ట్స్ వెల్లడించనుంది. దివ్యాంగుల కేటగిరిలో అర్హత పొందిన అభ్యర్థులకు రెండు రోజుల్లో వైద్య పరీక్షలు చేసి ఫలితాలను ప్రకటించాలని బోర్డు భావిస్తున్నట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: షాకింగ్ స్టడీ..స్మెర్మ్ కౌంట్ తగ్గుతే..క్యాన్సర్ వస్తుందా?

Latest News

More Articles