హైదరాబాద్ శివారులోని నార్సింగిలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. లావణ్య అనే యువతి నుంచి నాలుగు గ్రాముల ఎండీఎంఏ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా.. లావణ్య టాలీవుడ్ హీరో ప్రియురాలిగా తెలిసింది. గోవా నుంచి డ్రగ్స్ తీసుకొని నగరంలోఅమ్ముతున్నట్లు తెలిపారు. దీంతో ఆమెపై ఎన్ డీపీఎస్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇప్పటికే మోకిలా పీఎస్ డ్రగ్స్ కేసులో లావణ్య నిందితురాలిగా గుర్తించారు. సినీ ఇండస్ట్రీలో అనేక మందితో ఆమెకు పరిచయాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆమెకున్న లింకులపై కూపీ లాగే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం లావణ్యను రిమాండ్కు తరలించారు పోలీసులు.
ఇది కూడా చదవండి: పట్టణాలతో పోటీపడేలా గ్రామాల అభివృద్ధి