Sunday, May 19, 2024

భార్యను సముద్రంలో తోసేసి ..అడ్డంగా దొరికిన హోటల్ మేనేజర్..!!

spot_img

గోవాలోని ఓ స్టార్ హోటల్ మేనేజర్ తన భార్యను సముద్రంలోకి తోసేసి హత్య చేశారు. ఆ తర్వాత తన భార్య ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగి చనిపోయిందంటూ డ్రామాలు ఆడాడు. ఓ వ్యక్తి తీసిన వీడియోలో కావాలనే అతను తన భార్యను హత్య చేశాడని తేలడంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే…ఉత్తరప్రదేశ్ లోని లక్నోకు చెందిన గౌరవ్ కతియార్, దక్షిణగోవాలోని ఓ లగ్జరీ హోటల్లో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. ఏడాది క్రితమే లక్నోకు చెందిన దీక్షా గాంగ్వార్ తో పెళ్లి జరిగింది. ఇద్దరు కూడా గోవాలోనే కాపురం పెట్టారు. అయితే గౌరవ్ కు మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇదే విషయంపై వీరిద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. ఎలాగైనా తన భార్య అడ్డు తొలగించుకోవాలనుకున్న గౌరవ్..ఆమెను తన హోటల్ దగ్గర ఉన్న కాబో డి రామా బీచ్ కు తీసుకెళ్లాడు.

బీచ్ లో రాళ్లు ఉన్న ప్రదేశంలో ఆమెను తోసేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె మరణించింది. అయితే ప్లాన్ ప్రకారం అది ప్రమాదవశాత్తు జరిగినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. పోలీసులను తప్పుదోవ పట్టించే క్రమంలో ఉండగా…వారికి ఓ వీడియో లభించింది. బీచ్ లో ఉన్న వ్యక్తి గౌరవ్ తన భార్య కొడుతుండగా..సముద్రంలోకి తోసేసిన ఘటనను తన వీడియోలో బంధించాడు. ఒడ్డుకు వచ్చిన అతను..ఆమె చనిపోయిందో లేదోనని నిర్ధారించుకునేందుకు మళ్లీ సముద్రంలోకి వెళ్లిన ద్రుశ్యాలన్నీ అందులో రికార్డు అయ్యాయి. దీంతో గౌరవ్ ను పోలీసులు అరెస్టు చేశారు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ ప్రభుత్వ బంగ్లాలో టాయ్‎లెట్ల రిపేర్‌కు 35 లక్షలు

Latest News

More Articles