వారిద్దరూ ఒకరినొకరు ఎంతో ఇష్టంగా ప్రేమించుకున్నారు. కలిసిమెలిసి తిరిగారు, కబుర్లు చెప్పుకున్నారు. అయితే తమ ప్రేమను ఇంట్లో వాళ్లకు చెప్పలేక.. తనువు చాలించారు. ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Read also: కాంగ్రెస్ ప్రభుత్వ బంగ్లాలో టాయ్లెట్ల రిపేర్కు 35 లక్షలు
కొమరాడ మండల కేంద్రానికి చెందిన పద్మజ.. పార్వతీపురం మండలం చినమరికి గ్రామానికి చెందిన వానపల్లి శ్రావణ్ కుమార్ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పడానికి భయపడ్డారు. దాంతో పద్మజ తోటపల్లి బ్యారేజీలో దూకి చనిపోగా.. శ్రావణ్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. వీరిద్దరి మృతితో ఇరు కుటుంబాల్లో విషాదం చెలరేగింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.