నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలో విషాదకర ఘటన జరిగింది. మార్చాల గేటు సమీపంలో ద్విచక్ర వాహనం లారీ ఢీకొన్న ఘటనలో భార్యాభర్తలు మృతి చెందారు.
Also Read.. ఆసియా కప్ విజేత భారత్.. ఫైనల్లో సూపర్ విక్టరీ
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దంపతులు ప్రయాణిస్తున్న బైకును లారీ బలంగా ఢీకొనడంతో భార్యాభర్తలిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు మిడ్జిల్ మండలం బోయిన్పల్లి గ్రామానికి చెందిన నాగయ్య, పార్వతమ్మగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.