లక్నో: గొడవల నేపథ్యంలో ఒక వ్యక్తి తన భార్యను కత్తితో పొడిచి చంపాడు. అనంతరం తప్పించుకునే క్రమంలో అపార్ట్మెంట్ బిల్డింగ్ మూడో అంతస్తు నుంచి కిందకు దూకాడు. తీవ్రంగా గాయపడ్డ అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది.
Also Read.. హోం మంత్రి కారును తనిఖీ చేసిన తెలంగాణ పోలీసులు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ బట్టల షాపులో పని చేసే ఆదిత్య కపూర్.. శనివారం అర్ధరాత్రి తర్వాత భార్యతో గొడవ పడ్డాడు. కోపంలో కత్తితో పొడిచి భార్యను చంపాడు. ఇది చూసిన పిల్లలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తండ్రిని గదిలో బంధించేందుకు ప్రయత్నించగా.. తప్పించుకునే క్రమంలో అపార్ట్మెంట్ బిల్డింగ్ మూడో అంతస్తు నుంచి కిందకు దూకాడు. బిల్డింగ్ పైనుంచి దూకి గాయపడిన ఆదిత్యను పోలీసులు అరెస్ట్ చేశారు. చికిత్స కోసం అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.