Wednesday, May 22, 2024

హైదరాబాద్ వాసులకు మెట్రో రైల్ శుభవార్త

spot_img

ఉగాది పండుగ వేళ హైదరాబాద్ నగరవాసులకు హైదరాబాద్ మెట్రో శుభవార్త చెప్పింది. మార్చి 31తో ముగిసిన పలు రాయితీలను తిరిగి పొడగిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి ఇవాళ ( సోమవారం) కీలక ప్రకటన చేశారు. ఉగాది వేడుకల్లో భాగంగా సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డ్, మెట్రో స్టూడెంట్‌పాస్‌, సూపర్‌ పీక్‌ అవర్‌ ఆఫర్లను 6 నెలల పాటు పెంచుతున్నామన్నారు. ఈ నిర్ణయం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నామని ఎన్‌వీఎస్ రెడ్డి అన్నారు.

ఇప్పటివరకు అందించిన రాయితీలను తీసేస్తున్నట్లుగా రెండు రోజుల క్రితమే మెట్రో రైల్ అధికారులు ప్రకటించారు. ఉదయం, రాత్రి వేళల్లో అందించే 10 శాతం రాయితీని ఎత్తివేస్తున్నట్లు తెలిపారు. ఇక రూ.59కే ప్రయాణ సౌలభ్యం కల్పించే సూపర్‌ సేవర్‌ మెట్రో హాలిడే కార్డు, రద్దీ లేని సమయాల్లో ప్రయాణ ఛార్జీల్లో 10 శాతం తగ్గింపు అందించే సూపర్‌ ఆఫ్‌ పీక్‌ అవర్‌, మెట్రో స్టూడెంట్‌ పాస్‌లపై రాయితీలన్నీ మార్చి 31 తోనే ముగిశాయి. దీంతో రాయితీలు పొడగించకపోవడంపై మెట్రో ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి:బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్ న్యూస్

Latest News

More Articles