Saturday, May 4, 2024

హైదరాబాద్ లో ఐపీఎల్ బెట్టింగ్‌ ముఠా అరెస్ట్

spot_img

హైదరాబాద్‌లో ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ(సోమవారం) సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించారు.

రాజేంద్రనగర్‌, ఎస్‌ఓటీ ఆర్‌సీపురం పోలీసులు జాయింట్ ఆపరేషన్‌ నిర్వహించి గ్యాంగ్ ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 18 లక్షల 50 వేల రూపాయల నగదు, బ్యాంకు ఖాతాలో ఉన్న 18 లక్షల 34 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ.37,84,918 స్వాధీనం చేసుకున్నారు.

ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ రూపొందించి.. ఆ యాప్ తో హైదరాబాద్ కేంద్రంగా ఆన్ లైన్ బెట్టింగ్ నిర్వహిస్తోంది ఈ ముఠా. గ్యాంగ్ సభ్యులు రామకృష్ణగౌడ్, ఉపేందర్ గౌడ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై ఏమైనా కేసులు ఉన్నాయా అన్న‌ వివరాలపై విచారణ జరుపుతున్నారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ వాళ్లకు చెప్పు దెబ్బలు తప్పవు

Latest News

More Articles