Wednesday, May 1, 2024

కూల్ డ్రింక్ అనుకుని పెట్రోల్ తాగిన రెండేళ్ల బాలుడు.!

spot_img

ఏపీలో దారుణం జరిగింది. కూల్ డ్రింగ్ అనుకుని పెట్రోల్ తాగాడు రెండేళ్ల బాలుడు. చికిత్స పొందుతూ మరణించాడు. ఈ విషాదకర ఘటన నెల్లూరు నగరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని ఇరుగాళమ్మ కట్టకు చెందిన షేక్ కరిముల్లా, అమ్ము దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కరిముల్లా చికెన్ దుకాణం నడిపిస్తుండగా..అమ్ములు చేపల దుకాణంలో పనిచేస్తుంది. పిల్లలను పోషించుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

ఈ నెల 7వ తేదీ సాయంత్రం అమ్ముల ఇరుగాళమ్మ ఆలయం దగ్గర పనిచేస్తుండగా…ఆమె కొడుకు కాలేషా ఆమె వద్ద ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో అక్కడ ఉన్న ఓ పెట్రోల్ బాటిల్ ను చూసిన కాలేష కూల్ డ్రింక్ అనుకుని తాగాడు. వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఈ విషయాన్ని గుర్తించిన తల్లి బాలుడిని చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం అర్థరాత్రి బాలుడు మరణించాడు. బాధిత తల్లిదండ్రులు చిన్నబజారు పోలీసులకు మంగవారం ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా  చదవండి: మోడీ గ్యారెంటీ అంటే ప్రతిపక్ష నేతలను జైళ్లకు పంపించడమే

Latest News

More Articles