Wednesday, May 1, 2024

బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్ న్యూస్

spot_img

ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం కస్టమర్లకు అందుబాటులో ఉన్న 2 ప్లాన్ల వ్యాలిడిటీ గడువును పొడగించింది. 120 రోజుల వ్యాలిడిటీ రీఛార్జ్ ప్లాన్‌ను 150 రోజులకు పొడగించింది. ఈ మేరకు ప్లాన్‌ను అప్‌గ్రేడ్ చేసినట్టు చెప్పింది. యూజర్లు దేశవ్యాప్తంగా అన్ని టెలికాం సర్కిల్స్ లో అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ప్రయోజనాన్ని పొందవచ్చునని బీఎస్ఎన్ఎల్ వివరించింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌పై రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు, ప్రతి రోజు 0.5 జీబీ డేటాను పొందొచ్చంది. 60 రోజుల పాటు రింగ్‌టోన్‌లను కూడా పొందొచ్చని, యూజర్ల అనుభూతిని ఈ ప్లాన్ మెరుగుపరుస్తుందని బీఎస్ఎన్ఎల్ ఆశాభావం వ్యక్తం చేసింది.

రూ. 999 రీఛార్జ్ ప్లాన్‌పై ప్రస్తుతం 200 రోజుల వ్యాలిడిటీ లభిస్తుండగా దానిని 215 రోజులకు పొడగించింది. అయితే ఈ ప్లాన్‌లో యూజర్లు ఉచిత ఎస్ఎంఎస్, ఉచిత డేటా వంటి అదనపు ప్రయోజనాలు పొందలేరు. అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సేవలను మాత్రమే పొందే వీలుంటుంది. ఈ రెండు ప్లాన్ల వ్యాలిడిటీ పెంపుతో యూజర్లు తరచుగా రీఛార్జ్ లు చేసుకోవాల్సిన అవసరం లేకుండా బీఎస్ఎన్ఎల్ గుడ్‌న్యూస్ చెప్పినట్టయ్యింది. వినియోగదారులకు మరిన్ని సేవలు అందించడమే లక్ష్యంగా అడుగులు ప్రభుత్వరంగ టెలికం కంపెనీ ఇటీవలే ఎంపిక చేసిన పలు ప్లాన్లలో డేటా పరిమితులను పెంచింది. అంతేకాకుండా ఇంటర్నెట్ స్పీడ్‌ను కూడా అప్‌గ్రేడ్ చేసింది. దేశవ్యాప్తంగా త్వరలోనే 4జీ ప్లాన్లను ప్రారంభించబోతున్న నేపథ్యంలో కస్టమర్లకు ఆకర్షించేందుకు ఈ మేరకు సేవలను విస్తరిస్తోంది.

ఇది కూడా చదవండి: కేసీఆర్‌ను తిట్టేందుకు కాంగ్రెస్ పార్టీ రూ. 100 కోట్ల ఖ‌ర్చు

Latest News

More Articles