Saturday, May 11, 2024

వైజాగ్‌ టెస్టులో ఇంగ్లాండ్‌పై 106 పరుగుల తేడాతో భారత్ విజయం

spot_img

విశాఖపట్నం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను భారత్‌ 106 పరుగుల తేడాతో ఓడించింది. టీమ్‌ఇండియా నిర్దేశించిన 399 పరుగుల టార్గెట్ లో నాలుగో రోజు రెండో సెషన్‌లోపే ఇంగ్లండ్ 292 పరుగులకు ఆలౌటైంది. జాక్‌ క్రాలే (73) హాఫ్ సెంచరీ సాధించాడు. జస్‌ప్రీత్ బుమ్రా (3/46), రవిచంద్రన్ అశ్విన్ (3/72) అద్భుత బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేశారు. రెండు ఇన్నింగ్స్ ల్లోనూ కలిపి 9 వికెట్లు తీసిన బుమ్రా ‘ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌’ అవార్డు దక్కించుకున్నాడు. మూడో టెస్టు మ్యాచ్‌ ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్‌ వేదికగా ప్రారంభం కానుంది.

ఇది కూడా చదవండి: 16 నెలల తర్వాత తొలి టోర్నీలోనే గోల్డ్‌ సాధించిన వినేశ్‌ ఫొగట్‌

Latest News

More Articles