Thursday, May 23, 2024

16 నెలల తర్వాత తొలి టోర్నీలోనే గోల్డ్‌ సాధించిన వినేశ్‌ ఫొగట్‌

spot_img

భారత స్టార్‌ రెజ్లర్‌  వినేశ్‌ ఫొగట్‌.. రీఎంట్రీలో అదరగొట్టింది. రాజస్తాన్‌లోని జైపూర్‌ వేదికగా అడ్‌హక్‌ కమిటీ నిర్వహిస్తున్న సీనియర్‌ నేషనల్‌ రెజ్లింగ్‌  ఛాంపియన్‌షిప్స్‌లో గోల్డ్‌ మెడల్ సాధించింది. ఇటీవలే మొదలైన ఈ టోర్నీలో భాగంగా మహిళల 55 కిలోల విభాగంలో ఆమె 4-0 తేడాతో మధ్యప్రదేశ్‌కు చెందిన రెజ్లర్‌ జ్యోతిని ఓడించింది.

వినేశ్‌ 16 నెలల పాటు రెజ్లింగ్‌కు దూరంగా ఉంది. గతేడాది భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై లైంగిక ఆరోపణలతో ఆయనను ఆ పదవి నుంచి తప్పించాలని రాజీ లేని పోరాటం చేసిన రెజ్లర్లకు వినేశ్‌ ఫొగట్ నాయకత్వం వహించింది.

గతేడాది సెప్టెంబర్‌- అక్టోబర్‌ మధ్య జరిగిన ఆసియా క్రీడలలో ఫొగట్‌ పాల్గొనలేదు. మోకాలి గాయం కారణంగా వినేశ్‌.. 2023 ఆసియా క్రీడల నుంచి తప్పుకుంది.

ఇది కూడా చదవండి: ప‌ద‌వుల కోసం పార్టీ మారిన చ‌రిత్ర మీది.. ప్ర‌జ‌ల కోసం త్యాగాలు చేసిన చ‌రిత్ర మాది

Latest News

More Articles