త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి బీఆర్ఎస్కే మెజారిటీ స్థానాలు దక్కుతాయని తాజాగా ఇండియా టీవీ నిర్వహించిన ఒపీనియన్ పోల్స్లో వెల్లడైంది. తెలంగాణలోని మొత్తం 17 స్థానాలకుగాను 8 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ఈ ఒపీనియన్ పోల్స్ రిపోర్టు స్పష్టం చేసింది. ఓట్ల శాతం పరంగా చూస్తే బీఆర్ఎస్కు ఈ ఎన్నికల్లో 40 శాతం ఓట్లు దక్కుతాయని తెలిపింది. బీఆర్ఎస్ తర్వాత బీజేపీకి అత్యధిక స్థానాలు దక్కుతాయని రిపోర్టు తెలుపుతోంది. బీజేపీ 6 లోక్సభ స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని, కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు స్థానాలకు మాత్రమే పరిమితమవుతుందని పేర్కొంది. మిగిలిన ఒక్క స్థానం మజ్లిస్ పార్టీ తన ఖాతాలో వేసుకుంటుందని స్పష్టం చేసింది.
Read Also: రష్మిక ఫేక్ వీడియో క్రియేట్ చేసింది ఆమె అభిమానే.. ఫ్యాన్ పేజీకి లక్షల్లో ఫాలోవర్లు