Wednesday, May 22, 2024

వరల్డ్ కప్ ముగిసింది.. టీ 20 వచ్చింది.. నేడు భారత్‌, ఆసీస్‌ తొలి టీ20

spot_img

వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి బాధను కలిగిస్తుండొచ్చు.. ఆ పరాజయం వెంటాడుతుండొచ్చు.. కానీ అది గతం. ఆ ఫలితాన్ని మర్చిపోయి మరో కప్‌ దిశగా టీమ్‌ఇండియా సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించాల్సిన సమయమొచ్చింది. వచ్చే ఏడాది జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌పై గురి పెట్టాల్సిన తరుణం ఆసన్నమైంది. అందులో భాగంగా ఆసీస్‌ జట్టుతో అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనుంది. నేడు విశాఖపట్నం వేదికగా మొదటి టీ20 జరగనుంది.

Read Also: రూ. 300 అప్పు చెల్లించలేదని బట్టలూడదీసి బెల్టుతో..

అయితే ఈ సిరీస్‎లో వరల్డ్ కప్‎లో ఆడిన టాప్ ప్లేయర్లు రోహిత్‌శర్మ, విరాట్‌ కోహ్లీ, గిల్‌, అయ్యర్‌, రాహుల్‌, షమీ, సిరాజ్‌, బుమ్రా లేకుండానే టీమ్‌ఇండియా బరిలోకి దిగుతున్నది. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా గాయంతో టీంకు దూరంగా ఉండటంతో సూర్యకుమార్‌యాదవ్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇటీవల సిరీస్‌లో సెలెక్టర్లు సీనియర్లను తప్పిస్తూ ఐపీఎల్‌లో మెరుపులు మెరిపించిన యువకులకు జాతీయజట్టులో చోటు కల్పిస్తున్నారు. మెగాటోర్నీ నాటికి టీమ్‌ఇండియా 11 టీ20 మ్యాచ్‌లు ఆడనున్న నేపథ్యంలో అందుబాటులో ఉన్నవారిలో నుంచి ఆటగాళ్లను ఎంపిక చేసే అవకాశముంది. ముఖ్యంగా వన్డే జట్టుకు భిన్నంగా ప్రస్తుత టీ20 టీమ్‌లో ఎడమచేతి వాటం ప్లేయర్లు బాగా ఉన్నారు.

Read Also: 142 మంది విద్యార్థినులను లైంగికంగా వేధించిన కీచక ప్రిన్సిపల్‌

ఇషాన్‌ కిషన్‌, యశస్వి జైస్వాల్‌, తిలక్‌వర్మ, రింకూసింగ్‌, శివమ్‌ దూబే, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌ ఉన్నారు. రెగ్యులర్‌ కీపర్‌గా ఇషాన్‌ కిషన్‌ కొనసాగనుండగా, రిజర్వ్‌గా జితేశ్‌శర్మను ఎంపిక చేశారు. యశస్వి జైస్వాల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశముంది. బౌలింగ్‌ విషయానికొస్తే.. అర్ష్‌దీప్‌సింగ్‌, అవేశ్‌ఖాన్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, ముఖేశ్‌కుమార్‌తో బలంగా కనిపిస్తున్నది. చివరి రెండు మ్యాచ్‌లకు శ్రేయస్‌ అయ్యర్‌ జట్టుతో కలువనున్నాడు. హైదరాబాదీ క్రికెట్‌ దిగ్గజం వీవీఎస్‌ లక్ష్మణ్‌ ప్రస్తుతం టీమ్‌ఇండియాకు చీఫ్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.

Latest News

More Articles