Saturday, May 18, 2024

కూతురిని వేధిస్తున్న భర్త, అత్తామామలను చంపేసిన తల్లిదండ్రులు

spot_img

అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురుని ఓ అయ్య చేతిలో పెట్టారు ఆ తల్లిదండ్రులు. కొన్నాళ్లు బాగానే ఉన్న వారి కాపురంలో గొడవలు మొదలయ్యాయి. ఎన్నిసార్లు చెప్పినా వారిలో మార్పు రాకపోవడంతో అల్లుడిని, అతని తల్లిదండ్రుల్ని కత్తులతో పొడిచి చంపారు. ఈ దారుణ ఘటన ఏపీలోని పల్నాడు జిల్లాలో జరిగింది.

Read Also: వరల్డ్ కప్ ముగిసింది.. టీ 20 వచ్చింది.. నేడు భారత్‌, ఆసీస్‌ తొలి టీ20

ముప్పాళ్ళ మండలం దమ్మలపాడుకు చెందిన మాధురికి పిడుగురాళ్ల మండలం కోనంకికి చెందిన అనంతం నరేష్‎తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. గత కొంత కాలంగా మాధురి, నరేష్‎ల మధ్య కుటుంబ వివాదాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో మాధురికి అత్తింటి వారి నుండి వేధింపులు ఎక్కువ కావడంతో పెద్దల సమక్షంలో చర్చించుకునేందుకు మాధురి తరుపు బంధువులు కోనంకికి వచ్చారు. ఈ క్రమంలో మాధురి అత్తింటి వారికి పుట్టింటి వారికి మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చలు విఫలం కావడంతో ఇరు కుటుంబాల మధ్య మాట మాట పెరిగింది. తీవ్ర ఆగ్రహానికి లోనైన అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు విచక్షణ కోల్పోయి.. కూతురి భర్తను, అత్త మామల మీద కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అనంతం నరేష్ (30), అతని తల్లిదండ్రులు ఆదిలక్ష్మి,(50) సాంబయ్య (56)లు అక్కడికక్కడే మృతిచెందారు.

Latest News

More Articles