Sunday, May 5, 2024

బిర్యానీ కోసం 60సార్లు పొడిచి చంపిన 16ఏళ్ల కుర్రాడు

spot_img

అన్నం కోసం యుద్ధాలు జరిగాయని మనం చదువుకున్నాం. కానీ, ఇప్పుడు చూస్తున్నాం. బిర్యానీ కోసం ఓ యువకుడిని కొట్టి చంపిన ఘటన దేశరాజధాని ఢిల్లీలో జరిగింది. జాఫ్రాబాద్ సమీపంలోని మురికివాడలో 16, 17 ఏండ్లున్న ఇద్దరు మైనర్లు కుటుంబాలతో సహా జీవిస్తున్నారు. వీరి తల్లిదండ్రులు కష్టపడి పనిచేస్తూ.. కుటుంబాలను పోషించుకుంటున్నారు. కాగా.. బుధవారం మధ్యాహ్నం ఇద్దరు పిల్లలు వెల్‌కమ్ ఏరియాకు వెళ్లారు. అక్కడ 17 ఏళ్ల బాలుడిని బిర్యానీ కోసం రూ. 350 ఇవ్వాలని 16 ఏళ్ల బాలుడు అడిగాడు. తన దగ్గర డబ్బులు లేవని చెప్పినా వినకుండా బాలుడు పదేపదే విసిగించడంతో.. ఈ సారి గట్టిగా మందలించాడు. దాంతో రెచ్చిపోయిన 16 ఏండ్ల బాలుడు డబ్బులు లాక్కునేందుకు ప్రయత్నించాడు. బాధితుడు తిరగబడటంతో ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది. ఈ క్రమంలో బాధితుడి గొంతునులిమి చంపేందుకు నిందితుడు ప్రయత్నించాడు. అనంతరం తన దగ్గర ఉన్న కత్తితో పొడవడం ప్రారంభించాడు. ఇలా ఏకంగా 60సార్లకు పైగా పొడిచినట్లు సీసీటీవీ ఫుటేజీలో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో బాధితుడు రక్తమోడుతూ నేలపై పడిపోయాడు.

Read Also: కూతురిని వేధిస్తున్న భర్త, అత్తామామలను చంపేసిన తల్లిదండ్రులు

ఆ తర్వాత నిందితుడు గాయపడిన బాధితుడి చుట్టూ డ్యాన్స్ చేసి, ఆపై అతడి కాలు పట్టుకుని ఒక వైపుకు లాక్కెళ్లాడు. ఇది గమనించిన చుట్టుపక్కల వారు గాయపడిన యువకుడిని జిటిబి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు నిర్ధారించారు. అనంతరం సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నిందితుడైన బాలుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి దాదాపు ఒకటిన్నర నిమిషాల నిడివిగల వీడియో ఫుటేజీ బయటకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Latest News

More Articles