హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను బౌద్ధ ధర్మ పరిషత్ ఆహ్వానించింది. ఈనెల 10, 11వ తేదీల్లో మహారాష్ట్ర నాందేడ్ జిల్లా కినావట్ లో నిర్వహించనున్న 13వ బుద్ధిస్ట్ కౌన్సిల్ సమావేశానికి హాజరు కావాలని, ముఖ్య అతిథిగా పాల్గొని సమావేశాలను ప్రారంభించాలని బౌద్ధ ధర్మ పరిషత్ ఆహ్వానించింది. ఈ మేరకు మంగళవారం పరిషత్ నాయకులు ఎమ్మెల్సీ కవితను ఆమె నివాసంలో కలిసి ఆహ్వానాన్ని అందజేసారు.
Also Read.. తెలంగాణ బీసీ హక్కుల కోసం ‘‘యునైటెడ్ పూలే ఫ్రంట్’’