Sunday, May 5, 2024

కాంగ్రెస్ నాయకులపై డీజీపీకి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నాయకుల బృందం

spot_img

రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నేతలపై జరుగుతున్న దాడుల గురించి ఆ పార్టీ నేతలు డీజీపీ రవిగుప్తాకు ఫిర్యాదు చేశారు. హుజూర్ నగర్, మానకొండూర్, భూపాల పల్లి, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలపై చేసిన దాడులను, జరిగిన హత్యలను బీఆర్ఎస్ నాయకుల బృందం డీజీపీ దృష్టికి తెచ్చింది. నిన్న మంత్రి కోమటి రెడ్డి సమక్షంలో భువనగిరి జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసులు జరిపిన దాడిని డీజీపీకి వివరించారు. పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తూ, బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడాన్ని తక్షణమే అడ్డుకోవాలని డీజీపీకి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ నేతలకు వత్తాసు పలకకుండా, నిష్పక్ష పాతంగా వ్యవహరించేలా పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని డీజీపీ కోరారు. నిన్న భువనగిరిలో జరిగిన సంఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఎస్సైతోపాటు మంత్రిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

Read Also: అండర్‌-19 వరల్డ్‌ కప్‌.. న్యూజిలాండ్ ముందు భారీ టార్గెట్ ఉంచిన యువభారత్

డీజీపీని కలిసిన వారిలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్యేలు సైది రెడ్డి, భాస్కర్ రావు, కోరుకంటి చందర్, భువన గిరి జడ్పీచైర్మన్ సందీప్ రెడ్డి, సూర్యపేట జడ్పీ చైర్ పర్సన్ దీపిక, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, కార్పొరేషన్ల మాజీ ఛైర్మన్లు రావుల శ్రీధర్ రెడ్డి, రాకేష్ కుమార్ తదితరులు ఉన్నారు.

Latest News

More Articles