Sunday, May 19, 2024

దీపావళి బంపర్ ఆఫర్.. రూ. 80 వేల ఫోన్ రూ. 50 వేలకే..

spot_img

పండుగలొచ్చాయంటే చాలు మొబైల్ కంపెనీలు ఆఫర్ల వర్షం కురిపిస్తాయి. మరో పది రోజుల్లో దీపావళి ఉండటంతో ఫ్లిప్‎కార్ట్ బిగ్ దివాళీ సేల్‎‎ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అందులో ఐఫోన్ 14 మీద భారీ ఆఫర్ ప్రకటించింది. న‌వంబ‌ర్ 2 నుంచి షురూ కానున్న ఈ సేల్‌లో ఐఫోన్ 14ను రూ. 50 వేలకే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ లాంఛ్ ప్రైస్ రూ. 79,900 కాగా బ్యాంక్ ఆఫ‌ర్లు, ఇత‌ర డిస్కౌంట్ల‌తో క‌లుపుకుని రూ. 50,000లోపు ల‌భిస్తుండ‌టంతో అందరూ ఆ సేల్ కోసం ఎదురుచూస్తున్నారు. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు లేదా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డు క‌లిగిన క‌స్ట‌మ‌ర్ల‌కు రూ. 4000 అద‌న‌పు డిస్కౌంట్ లభించనుంది. అదేవిధంగా ఓల్డ్ ఫోన్ ఎక్స్ఛేంజ్ చేస్తే మరో రూ. 1000 బోన‌స్ అందనుంది.

Read Also: బీజేపీకి రాజీనామా చేసి.. బీఆర్ఎస్‎లో చేరిన మహిళా మోర్చా అధ్యక్షురాలు

Latest News

More Articles