తిరువనంతపురం : గగన్యాన్ ప్రాజెక్టులో మహిళలకు ప్రాధాన్యం ఇస్తామని ఇస్రో చైర్మన్ సోమనాథ్ చెప్పారు. మహిళా ఫైటర్ టెస్ట్ పైలట్లను, మహిళా శాస్త్రవేత్తలను ఇందులో భాగస్వాములను చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
Also Read.. ఐఎండీ అలెర్ట్: దూసుకొస్తున్న జంట తుఫానులు
మానవ సహిత అంతరిక్ష యాత్ర 2025 నాటికి చేపట్టవచ్చని తెలిపారు. మహిళా ఫైటర్ టెస్ట్ పైలట్లు మనకు లేరని, అందుకోసం ఎయిర్ఫోర్స్ ఫైటర్ టెస్ట్ పైలట్లను తీసుకుంటామని వివరించారు. వీరిద్దరికీ కేటగిరీలో స్వల్ప తేడా ఉందని, శిక్షణ పొందిన తర్వాత అంతా దారిలో పడిపోతుందని ఇస్రో చైర్మన్ అన్నారు.