Saturday, May 18, 2024

రాష్ట్ర ప్రజలకు చల్లటి కబురు..!

spot_img

హైదరాబాద్‌: ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు చల్లటి వార్త చెప్పింది హైదరాబాద్‌ వాతావరణ శాఖ. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం పొడి వాతావరణం ఉంటుందని, శనివారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.

వాయవ్య దిశ నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో ఈ నెల 29 వరకు ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఉదయం వేళలో 40 – 46 డిగ్రీలు, మధ్యాహ్నం సమయంలో 43 – 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం సమయాల్లో బయటకు రావొద్దని సూచనలు జారీ చేసింది. మరోవైపు ఎండల తీవ్రతతో రాష్ట్రవ్యాప్తంగా మంగళ, బుధవారాల్లో వడదెబ్బకు ఏడుగురు చనిపోయారు.

Latest News

More Articles