Sunday, May 19, 2024

హైద‌రాబాద్‌లో జాప్‌కామ్ సెంట‌ర్.. 1000 మందికి ఉద్యోగాలు..!

spot_img

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు క్యూ కడుతున్నాయి. హైద‌రాబాద్‌లో సెంట‌ర్ ఆఫ్ ఎక్స‌లెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు అమెరికాకు చెందిన ప్రొడ‌క్ట్ ఇంజినీరింగ్ అండ్ సొల్యూష‌న్స్ కంపెనీ జాప్‌కామ్ గ్రూపు ముందుకొచ్చిందని మంత్రి కేటీఆర్ తెలిపారు.

అమెరికాలోని వాషింగ్ట‌న్ డీసీలో జ‌రిగిన భేటీలో జాప్‌కామ్ వ్య‌వస్థాప‌కుడు, సీఈవో కిషోర్ ప‌ల్ల‌మ్‌రెడ్డితో మంత్రి కేటీఆర్ చ‌ర్చించారు. హైద‌రాబాద్‌లో ఏర్పాటుతో తొలుత 500 మందికి ఉద్యోగాలు.. ఏడాదిలోగా మ‌రో 1000 మందికి ఉద్యోగాలు క‌ల్పిస్తుంద‌ని మంత్రి కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు.

ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఆ కంపెనీకి ఆఫీసులు ఉన్నాయి. ట్రావెల్‌, హాస్పిటాలిటీ, ఫిన్‌టెక్‌, రిటేల్ రంగాల్లో కీల‌క‌మైన ఏఐ, ఎన్ఎల్‌పీ ఉత్ప‌త్తుల‌ను జాప్‌కామ్‌ కంపెనీ తయారు చేస్తున్నది.

Latest News

More Articles