Saturday, May 18, 2024

పాకెట్‎మనీ ఇవ్వలేదని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

spot_img

పాకెట్‎మనీ డబ్బులు ఇవ్వలేదని ఓ యువకుడు ప్రాణాలు తీసుకున్న సంఘటన గురువారం జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండల కేంద్రంలో చోటుచేసుకున్నది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అప్పాల వికాశ్‌(19) ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఖర్చులకు రూ.3 వేలు ఇవ్వాలని తండ్రి మల్లేశ్‌ను అడుగగా, ఇప్పుడు లేవని చెప్పాడు. దీంతో మనస్థాపానికి గురైన వికాస్‌, క్షణికావేశంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. యువకుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తండ్రి మల్లేశ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నవీన్‌కుమార్‌ తెలిపారు.

Latest News

More Articles