జగిత్యాల : ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేసి చూపాలని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అన్నారు. రైతులకు వరి ధాన్యనికి క్వింటాలకు రూ.500 బోనస్ చెల్లించాలన్నారు. అలాగే పేదింటి ఆడ పిల్లల వివాహాలకు లక్ష రూపాయలు, తులం బంగారం ఇవ్వాలని ఎమ్మెల్యే సూచించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చినప్పుడే ప్రభుత్వానికి ప్రజల్లో విశ్వసనీయత ఉంటుందన్నారు. గురువారం రాయికల్ పట్టణంలో ఎమ్మెల్యే మీడియా సమావేశంలో మాట్లాడారు.