Wednesday, May 22, 2024

యూ టర్న్ రెడ్డి?!

spot_img

తెలంగాణలో నిలకడలేని రాజకీయాలు చేయటంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫేమస్. ఏ పార్టీలో ఉంటే.. అదే పార్టీ వారిని తిట్టడం.. పూటకు ఒక పార్టీలోకి వెళ్ళటం ఈయనకు అలవాటు. కొన్ని నెలల క్రితమే కాంగ్రెస్ నుండి బీజేపీలోకి జంప్ అయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మునుగోడులో బీఆర్ఎస్ చిత్తుగా ఓడించింది. కోట్ల రూపాయలు వెదజల్లినా.. మునుగోడు ప్రజానీకం బీజేపీని చీకొట్టింది. మునుగోడు జనం బీఆర్ఎస్ కే పట్టం కట్టారు. ఆ తరువాత ఏమైందో తెలియదు కానీ రాజగోపాల్ రెడ్డిపై సోషల్ మీడియాలో మరో వార్త వైరల్ అవుతోంది.

తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం.. ప్రస్తుతం బీజేపీలో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యూ టర్న్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపైన తెలంగాణాలో చర్చ జరుగుతోంది, రేపు ఢిల్లీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరుతారని తెలుస్తోంది. నిన్న బీజేపీ విడుదల చేసిన తొలి జాబితాలో కోమటిరెడ్డి పేరు లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారా లేదా మరేదైనా కారణం ఉందా అన్నది తెలియాల్సి ఉంది.

Latest News

More Articles