Saturday, May 18, 2024

ట్రాన్సిట్ వారెంట్ లేకుండా కవితను ఎలా అరెస్టు చేస్తారు..?

spot_img

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయడంపై మాజీ మంత్రి, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈడీ అధికారులు భానుప్రియ, మీనాలతో వాగ్వాదానికి దిగారు. వారిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కవితను అరెస్ట్ చేశారనే విషయం తెలిసిన కేటీఆర్, హరీశ్ రావు ఆమె నివాసానికి చేరుకున్నారు. విచారణ ముగిసిన తర్వాత కవిత ఇంట్లోకి వెళ్లిన కేటీఆర్… ఈడీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  సోదాలు పూర్తయ్యాయని, అరెస్ట్ వారెంట్ ఇచ్చామని ఈడీ అధికారులు భానుప్రియ, మీనాలు చెబుతున్నారని, అలాగే అరెస్ట్ వారెంట్ ఇచ్చామని చెబుతున్నారని తెలిపారు. సోదాలు ముగిశాక కూడా ఇంట్లోకి రావొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశాని ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్ట్ చేయమని సుప్రీంకోర్టుకు చెప్పిన తర్వాత ఇప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారు? అని వారిని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు లో చెప్పిన మాటను తప్పుతున్న మీ అధికారులు కోర్టు ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కావాలని శుక్రవారం వచ్చారని ఆగ్రహం వక్తం చేశారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా కవితను ఎలా తీసుకు వెళతారు? అని ప్రశ్నించారు. ఈరోజు మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచేందుకు అవకాశం లేదంటూనే… అరెస్టు అని చెప్పడం పైన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు కేటీఆర్.

ఇది కూడా చదవండి: అన్ని వర్గాల ప్రజలకు హామీ ఇచ్చి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ

Latest News

More Articles