Sunday, May 5, 2024

అన్ని వర్గాల ప్రజలకు హామీ ఇచ్చి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ

spot_img

అన్ని వర్గాల ప్రజలకు హామీ ఇచ్చి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. కాంగ్రెస్ పార్టీ వంద రోజుల పాలన ముగిసిన సందర్భంగా ఇవాళ(శుక్రవారం) హైదరాబాద్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. బాండ్ పేపర్లు మంచి న్యూట్రీలు రాసిచ్చి మోసం చేసింది. మూడు నెలల పాలన చూసి ఓటేయాలని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలను చూసి ఓటేయాలని మేము కూడా కోరుతున్నాం. మేనిఫెస్టోలో అంశాల అమలు గురించి శ్వేతపత్రం విడుదల చేయండి. ప్రభుత్వ ఉద్యోగులకు మూడు డీఏలు ఇప్పటివరకు ఇవ్వలేదు. నాలుగు డీఏలు ఉపాధ్యాయ ఉద్యోగుల పెండింగ్ లో ఉన్నాయి. ప్రజా ఉద్యోగులను కూడా రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసింది. రేపు నోటిఫికేషన్ అంటున్నారు.. నీకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజే వాటిని అమలు చేయాలి. ఆటో డ్రైవర్లకు 12,000 ఆర్థిక సాయం అన్నారు. వారి ఆత్మహత్యలకు ఈ ప్రభుత్వమే కారణం. కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నందుకు ఆటో కుటుంబాలు, చేనేత కుటుంబాలు రైతు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇది వందరోజుల కాంగ్రెస్ పాలన సాధించిన అప్రతిష్ట. ఈ ఆత్మహత్యలకు కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత వహించాలి. ప్రజాస్వామిక పాలన అని మభ్యపెట్టారు. ప్రశ్నిస్తే చంపుతా.. చిరుత పేగులు మెడలో వేసుకుంటా అని సీఎం అంటున్నాడు. ముళ్ళ కంచెలు, నిర్బంధాలు, అరెస్టులు పెరిగాయి. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారు. ప్రభుత్వం పై వార్తలు రాస్తే జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయి. ఉద్యోగాలు పెంచాలని ఇందిరాపార్క్ దగ్గర ధర్నాలు చేస్తే టెంట్లు పీకేసి విద్యార్థులు అరెస్టు చేశారు. ఇది సోకాల్డ్ కాంగ్రెస్ ప్రజా పాలన పరిస్థితి. మబ్బులను చూసి కుండ వలక పోసుకున్నట్లయ్యింది పరిస్థితి. వర్షపాతం సరిగా లేనందున పంటలు ఎండిపోతున్నాయని ద వైర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం అన్నాడు. 14 శాతం వర్షపాతం ఎక్కువ ఉంటుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ప్రభుత్వం మేనేజ్ చేయలేకపోతున్నది. ఇది కాలం తెచ్చి వచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువన్నారు హరీశ్ రావు.

వంద రోజులైనా రుణమాఫీ చేయక మోసం చేశారని ఆరోపించారు. యాసంగి పంటకు 500 రూపాయల బోనస్ ఇస్తేనే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు మీకుంది. అడుగడుగునా రైతన్నను మోసం చేసినందుకు కాంగ్రెస్ పార్టీ రైతన్నకు క్షమాపణ చెప్పాలి.బీఆర్ఎస్ పనులలో ఏనాడు మోటార్లు కాలలేదు. కాంగ్రెస్ రైతన్నను నట్టేట ముంచింది. కౌలు రైతుల మీద ప్రేమ నటించి మోసం చేశారు. కౌలు రైతులను ప్రశ్నించే ప్రక్రియ కూడా ప్రారంభం కాలేదు. ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయకుండా రైతులను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎండిపోయిన పంటలకు ఎకరాకు 10వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. మీ ఫెయిల్యూర్ వల్ల రైతన్నలు చనిపోతున్నారని అన్నారు.

ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తా అన్నారు. మూడు నెలల్లో ఇప్పటివరకు మొత్తం 7500 కోట్లు మహిళలకు బాకీ పడింది. ఏం మొహం పెట్టుకొని మహిళా సదస్సు నిర్వహిస్తారని అన్నారు. కళ్యాణ లక్ష్మితో తులం బంగారం ఇస్తా అన్నారు. లక్ష పైగా పెళ్లిళ్లు జరిగాయి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి జరిగిన పెళ్లిళ్లకు మా ఆడబిడ్డలకు తులం బంగారం ఇవ్వాల్సిందే. నెలకు 4 వేల పింఛన్లు ఇస్తా అన్నారు. జనవరి నెల ఉన్న పింఛన్లు ఎగ్గొట్టారు. అనవసరానికి పోతే ఉన్నవస్త్రం పోయిందన్నట్టుంది.44 లక్షల మంది పింఛన్దారులు వచ్చే ఎన్నికల్లో కర్రు గాల్చి వాత పెట్టబోతున్నారు. మూడు నెలల కాలంలో ఒక్కొక్కరికి ప్రభుత్వం ఎనిమిది వేల రూపాయలు బకాయి పడింది. ఒక్కొక్కరికి 8 వేల రూపాయలు ఇచ్చిన తర్వాతనే ఓటు అడిగే హక్కు ఈ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ప్రభుత్వం తక్షణమే వారందరికీ 8వేల రూపాయలు పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. నిరుద్యోగులకు 4000 భృతి అన్నారు. అసెంబ్లీలో మేము ఎప్పుడు చెప్పలేదని మాట దాటవేశారు. రాష్ట్రంలో ప్రధానమైన అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేసింది. మేము ఇచ్చిన ఉద్యోగాలే తప్ప మీరు ఇచ్చిన కొత్త నోటిఫికేషన్లు ఏమున్నాయి. మా హయాంలో జరిగిన నియామకాలను కాంగ్రెస్ ఖ్యాతిగా గొప్పలు చెప్పుకుంటున్నారు. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం నింపి తీరాలి. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాల మీద దాడులు చేస్తోంది. మా నాయకుల మీద కార్యకర్తల మీద అక్రమంగా కేసులు బనాయిస్తున్నది. వందరోజుల కాంగ్రెస్ పాలన అరచేతిలో వైకుంఠం చూపింది. కాంగ్రెస్ హస్తం.. బస్మాసురా హస్తంగా మారింది. మెడ మీద కత్తి పెట్టి నాయకులను పార్టీలో చేర్చుకుంటున్నాం అని అనుకుంటున్నారు కావచ్చు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. నీతి నిజాయితీ ఉంటే చీము నెత్తురు ఉంటే.. ఇచ్చిన మాటని కాంగ్రెస్ పార్టీ అమలు చేసి చూపించాలి. అప్పుడే రాష్ట్ర ప్రజలను ఓటు అడగాలని డిమాండ్ చేస్తున్నామన్నారు హరీశ్ రావు.

ఇది కూడా చదవండి: వంద రోజుల పాలన: 3 విచారణలు, 6 వేధింపులు అన్నట్లు కాంగ్రెస్ పాలన సాగింది

 

Latest News

More Articles