Friday, May 17, 2024

ఫోన్​ ట్యాపింగ్ కేసు​లో నాపై ఆరోపణలు చేసిన వారంతా క్షమాపణ చెప్పాలి: కేటీఆర్

spot_img

ఫోన్ ట్యాపింగ్ విషయంలో తనపై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు పంపిస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా స్పందించారు. మంత్రి కొండా సురేఖా, కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మహేందర్ రెడ్డి ఆరోపణలకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలపై కేటీఆర్ సీరియస్ అయ్యారు. తనపై నిరాధర, అసత్య ఆరోపణలు చేస్తున్న వారి కచ్చితంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మంత్రితోపాటుగా ఇద్దరు నేతలపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి:శ్రీరామనవమికి భద్రాచలం వెళ్లే భక్తులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త.!

Latest News

More Articles