Monday, May 20, 2024

20 రోజుల్లో అత్తారింట్లోని ఐదుగురిని చంపిన కోడలు

spot_img

భర్త మీద కోపంతో ఏకంగా ఐదుగురిని అంతమొందించింది ఓ భార్య. భర్తతో పాటు ఆయన కుటుంబసభ్యులను కూడా చంపేసింది. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలో జరిగింది. గడ్చిరోలికి చెందిన శంకర్‌ కుంభారే, విజయ దంపతులకు ఇద్దరు కుమార్తెలు కోమల్‌, ఆనంద మరియు ఓ కొడుకు రోషన్‌ ఉన్నారు. కాగా.. రోషన్ కొంతకాలం క్రితం సంఘమిత్ర అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి సంఘమిత్ర తల్లిదండ్రులకు ఇష్టంలేదు. దాంతో కూతురి పెళ్లి తర్వాత కొన్నాళ్లకు ఆమె తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి చావుకు భర్తే కారణమని సంఘమిత్ర కోపం పెంచుకుంది. దీనికి తోడు భర్త, అత్తామామలు, ఆడపడచుల తీరు సంఘమిత్రకు అసలు నచ్చలేదు. కాగా.. వీరి కుటుంబానికి రోసా అనే మహిళతో ఆస్తితగాదాలు ఉన్నాయి. రోసా సహకారంతో భర్త కుటుంబంపై పగ తీర్చుకోవాలని సంఘమిత్ర భావించింది.

Read Also: నడిరోడ్డు మీద జుట్టుపట్టుకొని కొట్టుకున్న బీజేపీ మహిళా మోర్చా నాయకులు.. వైరలవుతున్న వీడియో

అందులో భాగంగా రోసా రంగు, రుచి, వాసనలేని ఓ విషాన్ని తీసుకొచ్చింది. ఆ విషాన్ని సంఘమిత్ర మొదట అత్తామామలకు ఇచ్చింది. విషం కలిపిన నీళ్లు తాగి ఆమె అత్తామామలు ఆస్పత్రి పాలయ్యారు. వారికి తీవ్రమైన ఒళ్లునొప్పులు, గుండెనొప్పి వచ్చాయి. వారిద్దరూ నాగ్‌పుర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సెప్టెంబరు 26న శంకర్‌ మరణించగా.. మరుసటిరోజు అతని భార్య విజయ చనిపోయింది. కొన్ని రోజుల విషాన్ని ఆడపడచులు, భర్తకు ఇచ్చింది. దాంతో కోమల్‌, ఆనంద, భర్త రోషన్‌ అస్వస్థతకు గురవ్వడంతో.. వెంటనే బంధువులు ఆస్పత్రికి తరలించగా అక్టోబరు 8న కోమల్‌, 14న ఆనంద, 15న రోషన్‌ చనిపోయారు. వీరందరి శవాలను పోస్టుమార్టం చేసిన వైద్యులు.. వీరంతా విషప్రయోగానికి గురయ్యారని తేల్చారు. దాంతో అనుమానాస్పద మృతులుగా కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా.. కోడలు సంఘమిత్రను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం వెలుగుచూసింది. దాంతో సంఘమిత్రకు సహకరించిన రోసాను కూడా పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు.

Latest News

More Articles