సంక్షేమంలో స్వర్ణయుగానికి కేరాఫ్ తెలంగాణ అయితే చీకటి పాలనకు చిరునామా కర్నాటక అని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. గాంధీభవన్ను గాడ్సేకు అప్పగించిన నాడే.. తెలంగాణ కాంగ్రెస్కు కౌంట్ డౌన్ మొదలైందని ఆయన అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ చేపట్టిన బస్సుయాత్ర మీద కేటీఆర్ సెటైర్లు వేశారు.
‘గత పదేళ్ల కాలంలో.. గిరిజన యూనివర్సిటీపై రాహుల్ ఎందుకు నోరుమెదపలేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై ఒక్కసారైనా ఎందుకు బీజేపీని నిలదీయలేదు. విభజన హామీలపై ఏనాడూ ఎన్డీఏను ప్రశ్నించని రాహుల్కు తెలంగాణలో పర్యటించే అర్హత లేదు. కర్నాటకలో ప్రజలకిచ్చిన హామీలన్నీ వందరోజుల్లోనే బొందపెట్టిన పార్టీ మీది. మ్యానిఫెస్టోలో ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ప్రభుత్వం మాది. కర్నాటకలో రైతులకు ఐదుగంటల కరెంట్ కూడా ఇవ్వలేమని చేతులెత్తేసిన చేతకాని దద్దమ్మలు మీరు. రైతులకు 24 గంటలు నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తూ.. తెలంగాణలో సాగును సంబురంగా మార్చిన పాలన మాది. నమ్మి ఓటేసిన కర్నాటక ప్రజలను నట్టేట ముంచి తెలంగాణలో నాటకాలకు తెరతీస్తే నమ్మేదెవరు. కరప్షన్కు కేరాఫ్ కాంగ్రెస్. కమీషన్ల కోసం కాంట్రాక్టర్లకు నిత్యం వేధింపులు చేసే మీరు ఇక్కడికొచ్చి నీతి వాక్యాలా మాట్లాడేది??
కాంగ్రెస్ బస్సుయాత్ర…
తుస్సుమనడం ఖాయం…సంక్షేమంలో స్వర్ణయుగానికి కేరాఫ్ తెలంగాణ.
చీకటి పాలనకు చిరునామా కర్ణాటక.గత పదేళ్ల కాలంలో..
గిరిజన యూనివర్సిటీపై రాహుల్ ఎందుకు నోరుమెదపలేదు.బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై ఒక్కసారైనా ఎందుకు బీజేపీని నిలదీయలేదు.
విభజన హామీలపై ఏనాడూ…
— KTR (@KTRBRS) October 19, 2023
దశాబ్దాలుగా పోడుభూముల సమస్యను కోల్డ్ స్టోరేజీలో పెట్టింది మీరు. ఏకంగా 4.50 లక్షల ఎకరాల భూములు పంచి అడవిబిడ్డలకు పట్టాభిషేకం చేసిన ప్రభుత్వం మాది. శ్రీకాంతాచారిని బలితీసుకున్న కాంగ్రెస్కు ఆ అమరుడి పేరెత్తే హక్కు లేదు. తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ పదేళ్ల జాప్యమే.. వందల మంది బలిదానాలకు కారణం అయింది. నిన్నఅయినా.. నేడు అయినా.. రేపు అయినా..
తెలంగాణకు నంబర్ వన్ విలన్ .. కాంగ్రెస్. గాంధీభవన్ను గాడ్సేకు అప్పగించిన నాడే.. తెలంగాణ కాంగ్రెస్కు కౌంట్ డౌన్ మొదలైంది. ల్యాండ్ మాఫియాకు కేరాఫ్ మీ పీసీసీ చీఫ్. టిక్కెట్ల కోసం కోట్ల సొమ్ముతోపాటు భూములు రాయించుకుంటున్న రాబందు… రేవంతు. రిమోట్ పాలన గురించి మీరా మాట్లాడేది.. ?? రిమోట్ కంట్రోల్ పాలనకు కేరాఫ్ మీ టెన్ జనపథ్. మా ప్రభుత్వ రిమోట్ తెలంగాణ ప్రజల చేతిలో పదిలంగా ఉంది. మీ గాంధీభవన్ రిమోటే గాడ్సే చేతిలో మాడి మసైపోతోంది. మూడు రోజుల పర్యటన చేసినా.. మూడు వందల రోజులు ముక్కు నేలకు రాసినా… తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ను నమ్మరు. వైఫల్యాల కాంగ్రెస్ను ప్రజలు ఎప్పటికీ విశ్వసించరు’ అని మంత్రి కేటీఆర్ అన్నారు.
Read Also: నేడు బంగ్లా వర్సెస్ ఇండియా.. రీసెంట్గా ఆ టీంతో ఆడిన 4 మ్యాచుల్లో 3 ఓడిన భారత్