హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు అనగానే గుర్తుకొచ్చేది సినిమా థియేటర్లు.గతంలో దాదాపు 15 సినిమా థియేటర్లు ఉండేవి. ప్రస్తుతం అందులో కొన్ని మూత పడగా..మరికొన్నింటిని కూల్చివేసి షాపింగ్ కాంప్లెక్స్ లు నిర్మించారు. అయితే ఇప్పుడు మళ్లీ ఆర్టీసీ క్రాస్ రోడ్డుకు సినిమా కళ రానుంది. నిసీ నటుడు మహేశ్ బాబు ఏఎంబీ క్లాసిక్ను సినీ లవర్స్ ముందుకు తీసుకురాబోతున్నారట. సుదర్శన్ 70 ఎంఎం స్థానంలో ఏఎంబీ క్లాసిక్ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు సమాచారం. మొత్తం 7 స్క్రీన్లతో మల్టీప్లెక్స్ ను సినీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీనికి ఏఎంబీ క్లాసిక్ అని పేరు పెట్టినట్లు కటౌట్లో రాసి ఉంది. ఏసియన్ గ్రూప్ భాగస్వామ్యంలో ఇది నడవనుంది. ఏఎంబీ సినిమాస్ మొదట 2018లో గచ్చిబౌలిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఇప్పటి వరకు సింగిల్ స్క్రీన్ మాత్రమే ఉంది. ఇప్పుడు ఏఎంబీ క్లాసిక్ ఏడు స్క్రీన్లతో అందుబాటులోకి వస్తుండడంతో సినీ లవర్స్ కు పండుగే. ప్రస్తుతం నారాయణగూడ, కాచిగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్డులో శాంతి, సప్తగిరి, సుదర్శన్ 35, సంధ్య 70, సంధ్య 35, దేవి 70, తారకరామ, శ్రీ మయూరి, వెంకటరమణ ఈ ప్రాంతంలో ఉన్నాయి.
ఇది కూడా చదవండి: మిషన్ భగీరథలో లాభం వెతికేవాడు సీఎం కావడం మన దురదృష్టం