Monday, May 20, 2024

ఒకప్పుడు తప్పు చేస్తే 58 ఏండ్లు బాధ పడ్డాం. మళ్లీ ఆ తప్పు చేయొద్దు

spot_img

పెద్దపల్లి జిల్లా: రైతులకు 3 గంటల కరెంట్ చాలని రేవంత్ రెడ్డి అంటున్నాడని, 3 గంటల కరెంట్ సరిపోతుందా? దేశాన్ని నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ. కరెంట్ ఇవ్వలేదు, ఫించన్ ఇవ్వలేదు, మళ్ళీ ఇప్పుడు ఒక్క ఛాన్స్ అని అడుగుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ కొత్త పార్టీ కాదు చెత్త పార్టీ అని, చావు నోట్లో తల పెట్టు తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ అని తెలిపారు. ఆగం కావద్దని, ఆలోచించి ఓటు వేయాలని కోరారు. సుల్తానబాద్ పూసాల రోడ్ వద్ద రోడ్ షోలో కేటీఆర్ పాల్గొని పెద్దపల్లి అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ఇది కూడా చదవండి: రైతుబంధు పంపిణీ అనుమతిని ఉపసంహరించుకున్న ఈసీ

బతుకులు బాగు చేసిన కేసీఆర్ ను గెలిపించాలి. ఒకప్పుడు తప్పు చేస్తే 58 ఏండ్లు బాధ పడ్డాం. కరెంట్ కావాలా కాంగ్రెస్ కావాలా ఆలోచించండి. కాంగ్రెస్ కు ఓటు వేస్తే కరెంట్ ఉండదు. దాసరి మనోహర్ రెడ్డి నీ బారీ మెజారిటీ తో గెలిపించాలి. పది మందికి సాయం చేసే వ్యక్తి దాసరి మనోహర్ రెడ్డిని భారీ మెజారిటీ తో గెలిపించండి. మన తెలంగాణ మన చేతిలో ఉండాలి. ఢిల్లీ చేతికి పోతే మళ్ళీ బతుకులు నాశనం అవుతాయి. గాడిదలకు గడ్డేసి ఆవుకు పాలు పిండితే పాలు వస్తాయా? బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే కొలనూరు, గర్రే పల్లిలను మండలాలుగా చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.

Latest News

More Articles