Friday, May 10, 2024

నిరుద్యోగులు ‘కాంగ్రెస్’ను నమ్మి మోసపోవద్దు.. గోసపడొద్దు

spot_img

హైదరాబాద్: రాహుల్ గాంధీకి దమ్ముంటే కర్ణాటకలో ని నిరుద్యోగులతో ముచ్చట పెట్టాలని బీఆర్ఎస్ నేతలు మానవత రాయి, దరువు ఎల్లన్నలు సవాల్ విసిరారు. తెలంగాణ భవన్ లో వారు మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగులు ఎవరు కాంగ్రెస్ ను నమ్మొద్దన్నారు. కాంగ్రెస్ పార్టీ విద్యార్ధి ఉద్యమకారులనే గుర్తించలేదని పేర్కొన్నారు. రాహుల్ నువ్వు ఏరోజైనా పరీక్షలు రాశావా ?  రేవంత్ రెడ్డి సీమాంధ్ర బానిస అని విమర్శించారు.

కాంగ్రెస్ నేతలు విద్యార్ధి నిరుద్యోగులతో రాజకీయ క్రీడా ఆడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలను ఎవరు నమ్మొద్దు. కర్ణాటకలో మీ హామీలు ఏమయ్యాయి. కాంగ్రెస్ నిరుద్యోగులను రెచ్చగొట్టే పనులు చేస్తుంది. నిరుద్యోగ మిత్రులు కాంగ్రెస్ ను నమ్మి మోసపోవద్దు గోసపడొద్దని వారు సూచించారు.

Latest News

More Articles