హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంకామ్ రెండవ సంవత్సరం చదువుతున్న నవీన్ అనే విద్యార్థి యూనివర్సిటీలోని మంజీరా హాస్టల్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గడ్డిమందు తాగి అర్ధరాత్రి సమయంలో ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన తోటి విద్యార్థులు నవీన్ను హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నవీన్ మరణించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాల కోసం పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Read Also: ఎస్సై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని మహిళా కానిస్టేబుల్ ఆందోళన