Saturday, May 18, 2024

ఎస్సై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని మహిళా కానిస్టేబుల్ ఆందోళన

spot_img

రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ ముందు హైదరాబాద్ కమిషనరేట్‎లో పనిచేసే ఓ మహిళా కానిస్టేబుల్ ఆందోళనకు దిగింది. తమ ఇంటిని కబ్జా చేస్తున్నారంటూ మేడిపల్లి పోలీసులను ఆమె ఆశ్రయించింది. ఈ కేసులో ఎస్సై శివకుమార్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ కబ్జాదారులకు సహకరిస్తున్నారని తెలిపింది. కనీసం దర్యాప్తు చేయకుండా కేసులు నమోదు చేస్తున్నారంటూ కన్నీరు పెట్టుకుంది. ఎస్సై శివకుమార్ వ్యవహారంపై రాచకొండ సీపీ విచారణ జరిపి న్యాయం చేయాలని కానిస్టేబుల్ నాగమణి వేడుకుంటోంది.

Read Also: టీఎస్ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే హిస్టరీ షీట్స్ ఓపెన్

ఎస్సై శివకుమార్ పై గతంలో సీపీకి, డీసీపీకి కంప్లైంట్ చేయడంతో తమపై కక్ష్య సాధింపు చర్యలు చేస్తున్నట్లు ఆమె వాపోయింది. తన భర్త వరుణ్ పై ల్యాండ్ తగాదా విషయంలో తప్పుడు మెడికల్ సర్టిఫికేట్ సృష్టించి రిమాండ్‎కు తరలించే ప్రయత్నం చేస్తున్నాడని తెలిపింది. ఎస్సై శివకుమార్ చేసిన అవినీతి, తీసుకున్న లంచాలపై తన వద్ద ఆధారాలు ఉన్నాయని నాగమణి తెలిపింది. పోలీస్ డిపార్ట్మెంట్‎లో పనిచేస్తున్న తనకే న్యాయం జరగకపోతే సామాన్య ప్రజలకు ఎలా న్యాయం చేస్తారు అని నాగమణి ప్రశ్నిస్తోంది. అధికారులు సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని వేడుకుంటోంది.

Latest News

More Articles