వచ్చే ఏడాది -2024 ఫిబ్రవరిలో మేడారం జాతర జరగనుంది. దీనికి సంబంధించి సమ్మక్క సారలమ్మ పూజారులు బుధవారం తేదీలను ప్రకటించారు. ఫిబ్రవరిలో 21 నుంచి 24 వరకు జాతర నిర్వహించనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 21 బుధవారం కన్నేపల్లి నుంచి సారలమ్మ, పునుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండయ్ నుంచి పగిడిద్దరాజు లు గద్దెలపైకి రానున్నారు.22 గురువారం చిలకల గుట్ట నుంచి సమ్మక్క తల్లి గద్దెపై చేరనుంది. 23 శుక్రవారం భక్తుల సమ్మక్క,సారలమ్మలకు మొక్కులు చెల్లించుకుంటారు. 24 శనివారం వన దేవతలను వనప్రవేశం చేయనున్నట్లు తెలిపారు.