జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ పిలుపునిచ్చారు. ఈ వేడుకలలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పాల్గొంటున్న నేపథ్యంలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. కూకట్ పల్లి జేఎన్టీయూలో ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవ రాష్ట్రస్థాయి వేడుకల నేపథ్యంలో చేస్తున్న ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ మంగళవారం జేఎన్టీయూ ఆడిటోరియంలో సమీక్ష నిర్వహించారు.
Read Also: కాలయాపన కోసమే ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ
ఈ సందర్భంగా కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ… ఈ నెల 25న ఉదయం 9 గంటలకు కూకట్ పల్లి జేఎన్టీయూలో జరిగే రాష్ట్ర స్థాయి జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎన్నికల సి.ఈ.ఓ వికాస్ రాజ్, చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి పాల్గొంటారని ఆయన తెలిపారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఏర్పాట్లపై బాధ్యతలు అప్పజెప్పిన అధికారులు సమర్థవంతంగా సమన్వయంతో అందరూ కలిసి కట్టుగా పని చేసి విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు. జిల్లాల నుండి ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారు కూకట్ పల్లి ఆడిటోరియంకు ఉదయం 8:30 గంటల వరకు చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని కోరారు.