Sunday, May 5, 2024

బైకును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. భర్త మృతి.. భార్యకు తీవ్ర గాయాలు!

spot_img

నాగర్ కర్నూల్ జిల్లా: నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని నల్ల వాగు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. దంపతులు వెళ్తున్న బైకును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో భర్త అక్కడికక్కడే చనిపోగా.. తీవ్రంగా గాయపడ్డ భార్య పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిజినెపల్లి మండలం లింగసానిపల్లి గ్రామానికి చెందిన తిరుమలేష్ (28), అతని భార్య లక్ష్మి బైకుపై వెళుతున్నారు.

Also Read.. తమ్ముడి వరస వ్యక్తితో అక్క ఆత్మహత్య.. అనుమానంలో కుటుంబసభ్యులు!

ఈక్రమంలో నల్ల వాగు సమీపంలో మెడికల్ కళాశాల వద్దకు రాగానే అటుగా వచ్చిన ఆర్టీసీ బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో తిరుమలేష్ అక్కడికక్కడే ప్రాణాలు వదలగా.. లక్ష్మికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని తీవ్రంగా గాయపడ్డ లక్ష్మిని జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్ల పేర్కొన్నారు.

Latest News

More Articles