జగిత్యాల: మెట్ పెల్లి మండలం కొండ్రికర్ల గ్రామస్థులు నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ అరవింద్ శవ యాత్ర చేపట్టి పిండ ప్రదానం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఓట్లు వేసి ఎంపీగా గెలిపిస్తే వారం రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని హామీ ఇచ్చిన అరవింద్.. బాండ్ పేపర్ సైతం రాసిచ్చి మోసం చేశాడని పసుపు రైతుల ఆగ్రహం వ్యక్తం చేశారు.