Sunday, May 19, 2024

మ‌ళ్లీ వ‌చ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే

spot_img

రాష్ట్రంలో మ‌ళ్లీ వ‌చ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని.. సీఎం అయ్యేది కేసీఆరేనని తేల్చి చేశారు మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు. ఇవాళ(మంగ‌ళ‌వారం) త‌మ ఇల‌వేల్పు యాదాద్రి శ్రీ ల‌క్ష్మీనర్సింహ స్వామి వారిని ద‌ర్శించుకున్న మంత్రి… వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు.

ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన  ఆయన.. ప్రజలు సుఖ శాంతుల‌తో ప్రశాంతంగా జీవించాలంటే, కేసీఆర్‌ సీఎం కావాల్సిందేన‌ని అన్నారు. ఆ భ‌గ‌వంతుడి చ‌ల్లని చూపు ప్రజలై ఉండాల‌ని తాను కోరుకున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్‌ జనరంజక పాలన అందిస్తున్నారని, ఇలాంటి సీఎంలు గ‌తంలో ఎవరు లేరన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆదరించాలన్నారు. అరవై ఏండ్లలో ఎన్నడూ లేనంత అభివృద్ధిని ఈ 9 ఏండ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసి చూపిందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

Latest News

More Articles