Friday, May 17, 2024

కేసీఆర్ గీసిన గీతను దాటేది లేదు.. రాజయ్య భావోద్వేగం

spot_img

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశయమయ్యారు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. ఈ సందర్భంగా కార్యకర్తలతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు రాజయ్. కడియం శ్రీహరికి బీఆర్ఎస్ హైకమాండ్ టికెట్ కేటాయించిందని.. కార్యకర్తలు అందరు కష్టపడి సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని గౌరవించాలని కోరారు.

తనకి ఉన్నత స్థానం కల్పిస్తామని సీఎం కేసీఆర్‌ చెప్పారని, ఇప్పుడున్న పదవికంటే మంచి స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారని అన్నారు. అధినాయకుడి మాటను గౌరవించి ముందుకు సాగుతానని తెలిపారు. కేసీఆర్‌ గీసిన గీతను దాటకుండా ఆయన ఆదేశాలు పాటిస్తానన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరికి సపోర్టు చేసే విషయంపై చర్చించారు.

 

Latest News

More Articles