Saturday, May 18, 2024

సియాసత్‌ ఎడిటర్‌ జహీరుద్దీన్‌ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి హరీశ్‌ రావు

spot_img

గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సియాసత్‌ ఉర్దూ పత్రిక మేనేజింగ్‌ ఎడిటర్‌ జహీరుద్దీన్‌ అలీఖాన్‌ కుటుంబ సభ్యులను మంత్రి హరీశ్‌ రావు పరామర్శించారు. మంత్రి మహమూద్‌ అలీ, ఎమ్మెల్సీ కడియం శ్రీహరితో కలిసి హైదరాబాద్‌ లక్డీకాపూల్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన మంత్రి హరీశ్‌ రావు.. అలీఖాన్‌ మరణపట్ల సంతాపం వ్యక్తంచేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

ఉర్దూ పత్రిక రంగానికి జహీరుద్దీన్‌ చేసిన సేవలను మంత్రి హరీశ్‌ గుర్తుకుచేసుకున్నారు. సోమవారం ప్రజాగాయకుడు గద్దర్‌ అంతిమయాత్రలో పాల్గొన్న అనంతరం ఆయన స్నేహితుడు, సియాసత్‌ మేనేజింగ్‌ ఎడిటర్‌ జహీరుద్దీన్‌ అలీఖాన్‌ గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే.

Latest News

More Articles