ఏపీలో సీఎం కేసీఆర్ కు అద్భుమైన అదరణ లభిస్తోందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. చాలా మంది ఆంధ్ర ప్రజలు కేసీఆర్ లాంటి నాయకుడు వుంటే బాగుండు ఆని కోరుకుంటున్నారు అని తెలిపారు. హుజూర్నగర్ బహిరంగ సభలో మాట్లాడిన మంత్రి .. సీఎం కేసీఆర్ ప్రతీ మాటను నిలబెట్టుకున్నారని చెప్పారు. ఒక్క ఆంధ్ర ప్రజలే కాదు కర్ణాటక, మహారాష్ర్ట, మధ్య ప్రదేశ్ ఇలా అన్నీ రాష్టాల్లో BRS కు, కేసీఆర్ కు అద్భుతమైన ఆధరణ లభిస్తోందన్నారు. ప్రతీ ఇంటికీ సురక్షత జలాలు వస్తున్నది ఏ రాష్ట్రంలో అంటే… అది తెలగాణలో మాత్రమేనని అన్నారు. ప్రతీ రంగంలో నంబర్ వన్ స్థానంలో తెలంగాణ ఉందన్న మంత్ర జగదీష్ రెడ్డి.. ఇవన్నీ చూసీ దేశం అంతా ఆసక్తిగా చూస్తోందన్నారు.
మూడేళ్లలో కాళేశ్వరం ఎలా పూర్తి చేశారు ఆని చర్చ జరుగుతుంటే…తెలంగాణను ఎడారి చేయాలని బీజేపీ చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ తెలంగాణా రాష్ట్రాన్ని అగం చేయాలని .. ఇబ్బంది పెట్టడం ధ్యేయంగా కనబడుతోందన్నరు. సీఎం కేసీఆర్ మాత్రo దేశాన్నీ అద్భుతంగా మార్చాలని చూస్తున్నారని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ గా మార్చడానికి కారణం ఇదేనన్నారు.
మంత్రి కేటీఆర్ అంటే ఒక బ్రాండ్ అని..యువ నాయకులు కేటీఆర్ పేరు ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతోందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి.