Saturday, May 18, 2024

60 ఏండ్లలో కాంగ్రెస్‌ చేయని అభివృద్ధిని తొమ్మిదేళ్లలోనే చేశాం

spot_img

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు రాబోయే ఎన్నికలకు సన్నద్ధం కావాలన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. రాబోయే సాధారణ ఎన్నికల సన్నాహక సమావేశాలలో భాగంగా ఇవాళ (శుక్రవారం) సూర్యాపేట రూరల్ మండలం లోని పలు గ్రామాలు, బూత్ ల వారిగా బీఆర్ఎస్ శ్రేణుల తో మంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. తొమ్మిదేండ్ల బీఆర్‌ఎస్‌ పార్టీ పాలనలో ఎంతో ప్రగతిని సాధించాం. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్‌ తక్కువ సమయంలో ఊహించని అభివృద్ధి చేశారు. ప్రజలంతా బీఆర్‌ఎస్‌వైపే ఉన్నారని అన్నారు. సీఎం కేసీఆర్‌  పాలనలో గ్రామాలలో  జరిగిన అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాల‌ను వివ‌రిస్తూ వాటిని ప్రజ‌ల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.

ప‌రిపాల‌నా ధ‌క్షత క‌లిగిన సీఎం కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాలు దేశానికి ఆద‌ర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు మంత్రి జగదీష్ రెడ్డి. ఉమ్మడి పాల‌న‌లో తెలంగాణ ప్రజ‌లు ఎన్నో ఇబ్బందులు ప‌డ్డార‌ని, స్వరాష్ట్రంలో వాటిని అధిగ‌మించి మిగతా రాష్ట్రాల‌కు ఆద‌ర్శంగా నిలుస్తున్నామ‌ని చెప్పారు. 60 ఏండ్ల కాంగ్రెస్‌ పాలనలో చేయని అభివృద్ధిని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తొమ్మిదేళ్లలోనే చేసి చూపించిందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ విజయం ఖాయం అని అన్నారు. గతంలో అభివృద్ధి  పథకాలకు గ్రామాలకు లక్ష రూపాయలు కూడా  వచ్చేవి కావన్న మంత్రి.. ఒక్కో గ్రామానికి బీఆర్ఎస్ హయాంలో కోట్లాది రూపాయల నిధులు వచ్చాయన్నారు మంత్రి జగదీష్ రెడ్డి.

సంక్షేమ పథకాలను తమ పార్టీలకు మాత్రమే ఇచ్చే సంస్కృతి గత పార్టీలది అయితే, పార్టీలకతీతంగా అందరికీ సంక్షేమ ఫలాలు అందించిన పార్టీ బీఆర్ఎస్ అన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. పెన్షన్ రావాలంటే ఎవరు పోతారా అని ఎదురు చూసే దౌర్భాగ్యపు పరిస్థితులు గత పాలకుల హయాంలో ఉండేవన్నారు. రైతుల కోసం ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన రైతు బీమా, రైతు బంధు, 24 గంటల కరెంటు పథకాలు గ్రామాల రూపురేఖలని మార్చేసాయన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం దేశంలో బీఆర్ఎస్ మాత్రమే అని అన్నారు. పట్టణాలతో సమానంగా పల్లెలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయన్నారు. గ్రామాలలో 2014 ముందు, ప్రస్తుత  పరిస్థితులను ప్రజలకు వివరించి వారిని చైతన్యవంతులు చేసే బాధ్యతను బీఆర్ఎస్ శ్రేణులు  తీసుకోవాలన్నారు. రాబోయే 46  రోజులు అని విభేదాలను పక్కనపెట్టి హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ శ్రేణులు పనిచేయాలని పిలుపు నిచ్చారు మంత్రి జగదీష్ రెడ్డి.

ఇది కూడా చదవండి: వంద‌ల కోట్ల పంపిణీ.. ముఠా నాయ‌కుడు రేవంత్ రెడ్డే!!

 

Latest News

More Articles