తాజాగా మీడియాతో చిట్ చాట్ చేశారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా పలు అంశాలపై నిర్మొహమాటంగా సమాధానం ఇచ్చారు. జైల్లో చంద్రబాబు ఆరోగ్యం బాలేదని వస్తున్న వార్తలపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. చంద్రబాబు ఆరోగ్యంపై లోకేష్ చేసిన ట్వీట్ ని గుర్తుచేస్తూ కేటీఆర్ కామెంట్స్ చేశారు.
చంద్రబాబు ఆరోగ్యంపై లోకేష్ ట్వీట్ బాధ కలిగించిందని కేటీఆర్ పేర్కొన్నారు. ‘కుమారుడిగా తండ్రి ఆరోగ్యంపై ఆందోళన ఎలా ఉంటుందో తెలుసు. కేసీఆర్ నిరాహార దీక్ష సమయంలో నాకూ ఆందోళన కలిగింది. హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలనే ఇక్కడ ఆందోళనలు వద్దంటున్నాం’ అని కేటీఆర్ తెలిపారు.