Monday, May 20, 2024

వంద సీట్లల్లో కేసీఆర్ ప్రచారం.. కేటీఆర్ కీలక కామెంట్స్

spot_img

మంత్రి కేటీఆర్ శుక్ర‌వారం మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై కీలక కామెంట్స్ చేశారు. కేసీఆర్ వంద నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌చారం చేస్తార‌ని కేటీఆర్ తెలిపారు. జీహెచ్ఎంసీ, సిరిసిల్ల‌, కామారెడ్డిలో నేను ప్ర‌చారం చేస్తాను. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో ఈసీ స్వ‌తంత్రంగా ప‌ని చేస్తుంద‌ని భావిస్తున్నా. అధికారుల బ‌దిలీల‌ను సాధార‌ణ బ‌దిలీలుగానే చూస్తాం. హుజురాబాద్‌లో కూడా మేమే గెలుస్తాం. ఈట‌ల రాజేంద‌ర్ 50 చోట్ల పోటీ చేసినా, ష‌ర్మిల 119 సీట్ల‌లో పోటీ చేసినా అభ్యంత‌రం లేద‌ని స్ప‌ష్టం చేశారు కేటీఆర్.

ఇక తెలంగాణ‌లో 40 చోట్ల అభ్య‌ర్థులే లేని కాంగ్రెస్.. 70 చోట్ల గెలుస్తామ‌ని ఆ పార్టీ నాయ‌కులు ఎలా చెబుతార‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్ర‌శ్నించారు. మంత్రి కేటీఆర్ శుక్ర‌వారం మీడియాతో చిట్‌చాట్ చేశారు. డ‌బ్బులు ఇచ్చిన వారికే కాంగ్రెస్ టికెట్లు ద‌క్కుతున్నాయి. కూక‌ట్‌ప‌ల్లి సీటు కోసం రూ. 15 కోట్లు అడిగార‌ని ఓ కాంగ్రెస్ నేత చెప్పారు. నేను చెప్పిన‌ట్టే క‌ర్ణాట‌క‌లో అక్ర‌మ డ‌బ్బు జ‌మ అవుతోంది. ఇప్ప‌టికే రూ. 8 కోట్లు కొడంగ‌ల్ చేరిన‌ట్టు స‌మాచారం ఉంద‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

Latest News

More Articles